చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఎన్నిసార్లు చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.కేసీఆర్ బండారం బయటపడుతుందనే ఇవాళ రాలేదన్నారు. నల్లగొండకు కాదు.. రేపు అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ కూడా నివేదిక కూడా ఇచ్చిందన్నారు. కాలు విరిగిందనే నెపంతో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. నల్గొండ సభకు ఎలా వెళ్లారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలే జరిగాయన్నారు. బ్యారేజ్ కు ముప్పు ఉందని 2020లోనే గుర్తించారన్నారు.
కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి ఎందుకు రాలేదన్నారు. కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే రావడానికి ఎందుకు భయపెడుతున్నారు... నల్లగొండ సభలో కేసీఆర్ సభలో మళ్లీ అధికారంలోకి వస్తామని నల్లగొండలో చెబుతున్నారని... ఉద్యమం ముసుగులో పసి పిల్లలను చంపి తాము అధికారంలోకి రాలేదని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డను 1800 కోట్లతో అంచనా వేస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 వేల కోట్లకు పెంచామన్నారు.
ప్రతి పక్ష పార్టీ నేతగా కేసీఆర్ బాధ్యతలను నెరవేర్చాలని సీఎం రేవంత్ అన్నారు.ఇరిగేషన్ పై కేసీఆర్ సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోతే ఏమవుతుందని బాధ్యతారహితంగా కేసీఆర్ అంటున్నారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ నిజాయితీ పరుడని తెలంగాణం సమాజం భావిస్తుందా అని ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్ట్లను ఏ విధంగా కాపాడుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్డిమాండ్ చేశారు.
కేసీఆర్ కు సీఎం కుర్చీ పోగానే నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్ గుర్తొచ్చిందన్నారు. హరీశ్ రావు లాంటి వారికి బీఆర్ఎస్ లో విలువలేదన్నారు. నల్లగొండ సభ కాదు.. రేపు అసెంబ్లీకి రమ్మన్నారు. కేసీఆర్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ.. బీఆర్ఎస్ చీకటి పొత్తు పెట్టుకున్నారని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను పరిశీలించడానికి అందరూ ఎమ్మెల్యేలను ఆహ్వానించామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారన్నారు.